హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత.. 14 భారత నౌకలు సేఫ్, మరో 14 ఇంకా అక్కడే!
- హర్మూజ్ జలసంధి నుంచి 14 భారత నౌకలు సురక్షితంగా బయటపడ్డాయన్న కేంద్రం
- పర్షియన్ గల్ఫ్లో మరో 14 నౌకలు ఉన్నట్టు తెలిపిన విదేశాంగ శాఖ
- ముంద్రా పోర్టుకు వస్తున్న నౌకపై బుధవారం దాడి చేసిన ఇరాన్
- నౌకలపై దాడుల ఘటనపై ఇరాన్కు భారత్ తీవ్ర నిరసన
- గత శనివారం రెండు భారత నౌకలపై కాల్పులు జరిపిన ఇరాన్
హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, గత కొన్ని వారాల్లో 14 భారత నౌకలు ఆ ప్రాంతం నుంచి సురక్షితంగా బయటపడ్డాయని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే, మరో 14 నౌకలు ఇంకా పర్షియన్ గల్ఫ్లోనే ఉన్నాయని తెలిపింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువారం న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఈ వివరాలు తెలిపారు.
పశ్చిమాసియాలో ఘర్షణల నేపథ్యంలో, ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదో వంతు జరిగే హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటల్లోనే, భారత్లోని ముంద్రా పోర్టుకు వస్తున్న 'ఎపామినోడాస్' అనే నౌకపై ఇరాన్ దాడి చేసింది. లైబీరియా జెండాతో ఉన్న ఈ నౌకతో పాటు మరో షిప్ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీసీ) ప్రకటించింది.
అంతకుముందు గత శనివారం కూడా, అనుమతి పొందిన రెండు భారత నౌకలపై ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఢిల్లీలోని ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫతాలీని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పిలిపించి మాట్లాడారు. భారత నౌకలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కాల్పులు జరపడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వాణిజ్య నౌకల భద్రతకు భారత్ ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.
గతంలో భారత్కు వచ్చే నౌకలకు ఇరాన్ సురక్షిత మార్గాన్ని కల్పించిన విషయాన్ని గుర్తు చేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, నౌకల రాకపోకలను తిరిగి సులభతరం చేయాలని కోరినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది.
పశ్చిమాసియాలో ఘర్షణల నేపథ్యంలో, ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదో వంతు జరిగే హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటల్లోనే, భారత్లోని ముంద్రా పోర్టుకు వస్తున్న 'ఎపామినోడాస్' అనే నౌకపై ఇరాన్ దాడి చేసింది. లైబీరియా జెండాతో ఉన్న ఈ నౌకతో పాటు మరో షిప్ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీసీ) ప్రకటించింది.
అంతకుముందు గత శనివారం కూడా, అనుమతి పొందిన రెండు భారత నౌకలపై ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఢిల్లీలోని ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫతాలీని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పిలిపించి మాట్లాడారు. భారత నౌకలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కాల్పులు జరపడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వాణిజ్య నౌకల భద్రతకు భారత్ ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.
గతంలో భారత్కు వచ్చే నౌకలకు ఇరాన్ సురక్షిత మార్గాన్ని కల్పించిన విషయాన్ని గుర్తు చేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, నౌకల రాకపోకలను తిరిగి సులభతరం చేయాలని కోరినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది.